ఇక ఆ తర్వాత కాలంలో మురళీమోహన్ కూడా వారసుడు అనే సినిమాను నిర్మించారట. ఆ సినిమాలో కృష్ణ , నాగార్జున తండ్రి కొడుకులు గా నటించడం జరిగింది. సాధారణంగా ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న అప్పుడు కథను బట్టి పాత్రలను బట్టి ఆ సినిమాను మనం చూడాలి. అయితే అప్పట్లో ఇద్దరు హీరోలకు కూడా అభిమానులు చాలా మంది ఉండేవారని తెలిపారు. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానులకి గొడవ మొదలవడం జరిగిందట. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కృష్ణా నాగార్జున వాదించుకుంటారు నువ్వెంత అంటే నువ్వెంత అని తెలియజేశారు. ఇది చూసిన తర్వాత కృష్ణ అభిమానులు పెద్ద గొడవ చేశారని తెలిపారు.
అంతటి గొప్ప హీరో ని పట్టుకొని నాగార్జున అలా ఎలా మాట్లాడుతారు అని అలా అనడానికి వీలు లేదు అంటూ తన ఇంటి మీదకి గొడవ చేయడానికి కృష్ణ అభిమానులు వచ్చారు అని తెలిపాడు. మురళీమోహన్ మాత్రం కథను బట్టి పాత్రలను బట్టి మాత్రం చూడాలని తెలియజేశారు. ఎవరు ఏమనుకున్నా ఇక ఈ కథను మార్చడం కుదరదు అని చెప్పి వెళ్లిపోయాం అని తెలిపాడు మురళీమోహన్. అయితే ఈ సినిమా కథ కృష్ణ కు నచ్చడంతో ఇక అక్కడున్నవారంతా కామ్గా వెళ్లిపోయారట.