అయితే నటి ఖుష్బూ ఇప్పుడంటే రాజకీయాలు, కుటుంబ బాధ్యతలు అంటూ చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీగా ఉండేవారు. అయితే ఆమె స్టార్ డైరెక్టర్ సుందర్ను 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అమ్మాయిలు ఉండగా వారిలో పెద్ద కుమార్తె అవంతిక ఇపుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సంతోషంగా వ్యక్తం చేశారు ఖుష్బూ .
అలాగే తన కుమార్తె ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. నా పెద్ద కూతురు అవంతిక ఎన్నో కలలతో లండన్ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణను పూర్తి చేసి ఇపుడు సినిమాల్లోకి రావడానికి సిద్దం అయ్యింది. మేము ఆమెను లాంచ్ చేయడం లేదు అదే విధంగా సిఫార్సు చేయడం లేదు. తన స్వతహాగా సినీ పరిశ్రమలోకి వస్తోంది.... నా కుమార్తెను అందరూ దీవించాలి. అందరి ప్రేమాభిమానాలను అందించాలని కోరారు నటి ఖుష్బూ. మరి ఈమె సినిమా గురించి త్వరలోనే వివరాలు రానున్నాయి.