స్టార్ కిడ్స్ కు ఇండస్ట్రీ ఎంట్రీ ఈజీ గానే దక్కుతుందన్న విషయం విదితమే. కాగా ఇపుడు ప్రముఖ సీనియర్ నటి కుష్బూ కుమార్తె కూడా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఖరారు అయ్యింది. త్వరలోనే ఈమె పెద్ద కుమార్తె స్క్రీన్ పై కనిపించనుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెబుతూ తన కుమార్తె ను దీవించాలని కోరారు నటి కుష్బూ. తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా రాణించిన బ్యూటిఫుల్ హీరోయిన్ కుష్బూ సుందర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే నటి ఖుష్బూ ఇప్పుడంటే రాజకీయాలు, కుటుంబ బాధ్యతలు అంటూ చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీగా ఉండేవారు. అయితే ఆమె స్టార్ డైరెక్టర్ సుందర్‌ను 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అమ్మాయిలు ఉండగా వారిలో పెద్ద కుమార్తె అవంతిక ఇపుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సంతోషంగా వ్యక్తం చేశారు ఖుష్బూ .

అలాగే తన కుమార్తె ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. నా పెద్ద కూతురు అవంతిక ఎన్నో కలలతో లండన్‌ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణను పూర్తి చేసి ఇపుడు సినిమాల్లోకి రావడానికి సిద్దం అయ్యింది. మేము ఆమెను లాంచ్ చేయడం లేదు అదే విధంగా సిఫార్సు చేయడం లేదు. తన స్వతహాగా సినీ పరిశ్రమలోకి వస్తోంది.... నా కుమార్తెను అందరూ దీవించాలి. అందరి ప్రేమాభిమానాలను అందించాలని కోరారు నటి ఖుష్బూ. మరి ఈమె సినిమా గురించి త్వరలోనే వివరాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: