కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రం. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈమధ్య కాలంలో కమల్ సినిమాకు రానటువంటి క్రేజీ కలక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. ఆల్రెడీ ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా విక్రం సినిమా సూపర్ హిట్ అయ్యిందని తెలిసిందే. మండే తోనే తెలుగులో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది.

పాన్ ఇండియా సినిమాగా రిలీజైన విక్రం సినిమా పోటీగా మేజర్ లాంటి సినిమా వచ్చినా సరే రేసులో నిలబడ్డది. ఈ క్రమంలో కమల్ సినిమా సత్తా ఏంటన్నది విక్రం సినిమాతో తెలుస్తుంది. ఇదిలాఉంటే కమల్ విక్రం చూసిన మెగా ఫ్యాన్స్ చిరంజీవికి కూడా ఇలాంటి ఓ మాస్ హిట్ అవసరమని అంటున్నారు. చిరు వరుస సినిమాలు చేస్తున్నా అందులో ఏది అంత పెద్ద సీరియస్ సబ్జెక్ట్ కాదు సీరియస్ గా తీసిన ఆచార్య కాస్త తుస్సుమన్నది.

మెగా ఫ్యాన్స్ మాత్రం మా మెగాస్టార్ కోసం ఓ విక్రం సినిమా కావాలని అంటున్నారు. అయితే కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా దాదాపు మెగా ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలన్నిటితో వస్తుందని అంటున్నారు. ఆ సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చుతుందని టాక్. ఇంకా లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ కూడా స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి తెలుగులో లోకేష్ కనగరాజ్ లాంటి డైరక్టర్ ఎవరు లేరని.. అలాంటి ఓ మాస్ కథతో చిరుతో సినిమా చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మెగాస్టార్ వారి కోరిక మేరకు అలాంటి ఓ ఫుల్ లెంగ్త్ మాస్ కథకు ఓకే చెబుతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: