గుర్రం ఎగరావచ్చు అని అంటుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో అదే జరిగేట్టు కనిపిస్తుంది.అసలు ఆంధ్రప్రదేశ్ లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ కి 2024 ఎన్నికలు పూర్వ వైభవం తీసుకువస్తాయా అంటే అవును అనేలా ఒక పరిణామం కనిపిస్తోంది.ఒంగోలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఎక్కడా కూడా కాంగ్రెస్ కి గెలుస్తుందనే ఆశలు లేవు. చివరికి ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ సీటులో కూడా ఆశలు లేవు. కానీ ఒంగోలులోని చీరాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఉనికి చాటుకునే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.అయితే దానికి కారణం మాత్రం కాంగ్రెస్ బలం కాదు మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా 2014లో ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు. అయితే 2019లో వైసీపీ తరఫున పోటీ చేసినా ఓటమి వరించింది. ఈసారి మాత్రం ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అందువల్ల ఆయన పార్టీ మారి కాంగ్రెస్ నుంచి చీరాలలో పోటీ చేస్తున్నారు.


దాంతో ఈసారి ఆయన తన బలాన్ని ఖచ్చితంగా చాటుకుంటారని తెలుస్తుంది.వాస్తవానికి 2014 విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక ఏర్పడిన నేపథ్యంలో అప్పటి దాకా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా ఉన్న ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతుల సునీతపై ఏకంగా 10 వేల 335 ఓట్ల మెజారిటీతో గెలుపుని సాధించారు.అయితే అదే క్రిష్ణ మోహన్ 2019లో వైసీపీ నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి 17వేల పైగా ఓట్లతో ఘనవిజయం సాధించారు. అయితే తనకు సొంత బలం ఉందని భావిస్తూ ఆమంచి క్రిష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఇప్పుడు ఆయన మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని చూసుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎక్కువ చోట్లనే పోటీ చేస్తోంది. కానీ ఎక్కడా గెలుస్తామని గ్యారంటీ మాత్రం లేదు. కానీ ఎందుకో చీరాల సీటు విషయంలో మాత్రం గెలిచే ప్రయత్నం అయితే ఉంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా ఆ క్రెడిట్ పూర్తిగా క్రిష్ణ మోహన్ అకౌంట్ లోకే పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: