మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.ఇకపోతే తాజాగా చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలావుండగా 66 ఏళ్ళ ఏజ్ లోనూ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి యువ హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే దాదాపు అరడజను సినిమాలు చిరంజీవి ఓకే చేసి ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే త్వరలో దసరాకి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు చిరంజీవి.పోతే  మోహన రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 

ఇక ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మురళి మోహన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలావుండగా 31 ఏళ్ళ తర్వాత మురళీ మోహన్ గాడ్ ఫాదర్ సినిమాలో మళ్ళీ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.పోతే  గతంలో 'మనవూరి పాండవులు', 'త్రినేత్రుడు', 'యుద్ధభూమి', 'గ్యాంగ్‌ లీడర్‌' లాంటి పలు సినిమాల్లో మురళీ మోహన్ చిరంజీవి కాంబినేషన్ లో కలిసి నటించారు. ఇదిలావుండగా తాజాగా మురళీ మోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి తెలిపారు.అయితే మురళీ మోహన్ మాట్లాడుతూ.. ”కొన్ని రోజుల క్రితం చిరంజీవి నాకు ఫోన్ చేసి గాడ్‌ ఫాదర్‌ అనే సినిమా తీస్తున్నాం.

అంతేకాదు మా దర్శకుడు మోహన్‌ రాజా మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కి అనుకుంటున్నారు.ఇకపోతే  మీ ఫొటోలు పంపిస్తారా? మీ నాన్నగారు చనిపోయినపుడు కొన్నాళ్లు మీరు వైట్‌ హెయిర్‌తో ఉన్నారు. ఇక దానికి సంబంధించిన ఫొటోలుంటే పంపించండి అని అడిగారు.కాగా  నేను వెంటనే ఫోటోలు పంపించాను. అయితే దర్శకుడు చూడగానే ఆ గెటప్ లోనే సినిమాలో కావాలి అన్నాడట. ఇక దీంతో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కోసం తెల్ల జుట్టుతోపాటు గడ్డాన్ని పెంచాను.అయితే  నా పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. పోతే సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు.చూడాలి మళ్ళీ వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: