వీరిద్దరు గురు అనే సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెద్దలను ఒప్పించి చివరికి వివాహబంధం లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఇప్పటికి కూడా వీరిద్దరూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భం దాల్చింది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎన్నో వచ్చాయి. ఇక ఈ వార్తలపై అభిషేక్ బచ్చన్ గాని ఐశ్వర్య రాయి కానీ స్పందించలేదు అని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవలే అభిషేక్బచ్చన్ కేస్ తో బంతా హై అనే ఒక కామెడీ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త ఇటీవలే విడుదలై వైరల్ గా మారింది.
ఈ షోకు హోస్ట్ గా రితేష్ దేశ్ముఖ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మీరు సెట్స్ లో కొన్ని వస్తువులను దొంగతనం చేశారట కదా అంటూ సరదాగా అభిషేక్ బచ్చన్ ను నిందించాడు రితేష్ దేశ్ ముఖ్. ఈ క్రమంలోనే స్పందించిన అభిషేక్ బచ్చన్ అవును గురు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఐశ్వర్య రాయ్ కి ఎత్తుకు వెళ్ళిపోయాను అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఇక ఇద్దరూ కూడా కాసేపు పగలబడి నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అభిమానులు అందరూ కూడా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.