ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు ఆది పురుష్ చిత్రం విడుదల కాబోతుంది. బాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమా యొక్క చివరి దశ పనులను చేస్తున్న చిత్ర బృందం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించగా ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం ఈ సినిమాతో తప్పకుండా వస్తుందని వారు భావిస్తున్నారు.

 బాహుబలి సినిమా తర్వాత రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ హీరో వాటి ద్వారా మంచి ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరుస్తున్న ఆయన సినిమాలు ఇప్పుడు తప్పకుండా మంచి విజయాలను అందుకుంటాయని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా ఆయన చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన ఈ హీరో ఇంకొక వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను కూడా షూటింగ్ చేస్తున్నాడు

ఈ విధంగా ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేసి ఆ తరువాత మారుతి మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని సినిమాను మొదలుపెట్టడానికి సన్నహాలు చేయబోతున్నాడు. అయితే ఇన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నా కూడా ప్రభాస్ మరికొన్ని సినిమాలను ఒప్పుకునే విధంగా ముందుకు వెళ్లడం ఆయన ఎందుకు ఇంత తొందరగా ఆలోచిస్తున్నాడు అన్న అనుమానాలను ఆయన అభిమానులు కలిగిస్తున్నారు. త్వరలోనే బాలీవుడ్ దర్శకుడైన సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది అని అంటున్నారు. అక్కడ  భారీ సినిమా లు చేసే దర్శకుడిగా ఉన్న సిద్ధార్థ్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా యొక్క కథా చర్చలు కూడా జరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: