తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అవసరాల శ్రీనివాస్.  ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అష్ట చెమ్మ అనే సినిమలో నాని కి పోటీగా సెకండ్ హీరోగా కూడా నటించాడు. ఇక ప్రస్తుతం కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా ఏంటో చూపిస్తా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అవసరాల శ్రీనివాస్.


 అయితే ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే పాత్రలు ఇప్పటివరకూ ఎన్నో చేశాడు అని చెప్పాలి.  అలాంటి వాటిలో మహానటి సినిమాలో ఎల్.వి.ప్రసాద్ పాత్ర కూడా ఒకటి అని చెప్పాలి. ఎల్.వి.ప్రసాద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ సరిగ్గా సరిపోయారు. ఇకపోతే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో ఎల్వి ప్రసాద్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నేను కూడా భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.


 అయితే ముందుగా సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ సరైన ఎంపిక కాదు అని నేను అనుకున్నాను.  కానీ ఆ తర్వాత మాత్రం సావిత్రి పాత్ర కోసం ఆమె కరెక్ట్ గా ఫిట్ అయింది.. ఆమె తప్ప మరెవరూ నటించలేరు అనేంత పాత్రలో లీనం అయిపోయింది కీర్తి సురేష్.  సావిత్రి పాత్రలో తనను తాను కొత్తగా మలుచుకుని ప్రేక్షకులకు ప్రూవ్ చేసుకుంది అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. నాగశౌర్య అడగడంతో నిహారిక తో కలిసి ఒక్క సినిమా కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఒకవైపు దర్శకుడిగా మరో వైపు నటుడిగా కూడా బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: