హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చి విజయ దిశగా దూసుకుపోతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ను ప్రభాస్ నటిస్తున్న  ప్రాజెక్ట్ -k సినిమాకి లింక్ చేస్తూ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు చిత్రాల స్టోరీ ఒకే అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఒకే ఒక జీవితం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తన తల్లిని బతికించుకోవడం కోసం టైం ట్రావెల్ తో హీరో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు.. ఇక అదే పాయింట్తో ప్రాజెక్ట్ -k రూపొందుతున్నట్లుగా సమాచారం. అయితే ఒకే ఒక జీవితం సినిమాలో మాత్రం టైం ట్రావెల్ అనే పాయింట్ కి బాగా చూపించడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ -k సినిమా కూడా ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే  తెరకెక్కించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు  సమాచారం. దీంతో ఈ రెండు సినిమా కథలు ఒకటే అన్నట్లుగా వార్తలు వైరల్ గా మారాయి.. ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరోక్షంగా స్పందించడం జరిగింది.


ఇక అందుకోసం నాగ్ అశ్విన్ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా స్టేటస్ పెడుతూ.. ప్యారడైజ్ వద్ద బస్సు ఆగి అక్కడ దిగిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ బిర్యాని తినలేరని తెలియజేశారు. ఆ విధంగా తన సినిమాపై వస్తున్న వార్తలను ఖండించడం జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి రూ.550 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అమితాబచ్చన్, దీపికా పడుకొనే తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. వచ్చేయేడాది అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: