కొన్నిసార్లు కొన్ని మంచి సినిమాలు హీరోలకు చేజారుతూ ఉంటాయి. అవి వేరే హీరోలు చేయడం వాటి ద్వారా వారు భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా
ప్రభాస్ హీరోగా నటించవలసిన ఓ
సినిమా తమిళ
హీరో చేసి ఆయన భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధంగా ఒక మంచి
సినిమా అవకాశాన్ని చేజార్చుకోవడం ఆయన అభిమానులను ఇంకా కలిచి వేస్తుంది.
మోహన్ రాజా దర్శకత్వంలో తమిళంలో
జయం రవి హీరోగా నటించిన తని ఒరువన్
సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఆ
సినిమా ద్వారా ఇటు
హీరో మరియు దర్శకుడు ఇద్దరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల ముందుగా
ప్రభాస్ కు చేయాలని భావించానని
మోహన్ రాజా చెప్పడం జరిగింది. ఆయన తెలుగులో ఇటీవల
మెగాస్టార్ చిరంజీవితో కలిసి
గాడ్ ఫాదర్ అనే సినిమాను చేయగా ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది.
ప్రభాస్ కు ఈ
సినిమా యొక్క కథను వినిపించడం జరిగిందని అయితే అప్పటి పరిస్థితుల రీత్యా ఆయన ఇతర కమిట్మెంట్లు ఉండడం వల్ల ఈ
సినిమా చేయడం జరగలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో
మోహన్ రాజా త్వరలోనే అలాంటి ఓ కథను రెడీ చేసి
ప్రభాస్ కు వినిపిస్తానని చెప్పడం
ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. త్వరలోనే వీరి కలయికలో
సినిమా రావడం నిజంగా మంచి విషయం అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకున్న
ప్రభాస్ ఈ దర్శకుడు తో
సినిమా చేయడం ఎంతవరకు వీలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో ధ్రువ పేరుతో
రామ్ చరణ్ రీమేక్ చేయగా అది కూడా సంచలన విజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.