సొంత బ్యానర్ లో నాగశౌర్య షిర్లే సేథియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఈయన ఒక బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా థియేటర్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక మిశ్రమ ఫలితాన్ని అందుకుంది మరీ. ఇలా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీ థియేటర్లో విడుదల కాగా ఈ సినిమా విడుదలైన నెల రోజులకు అంటే అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మనం వేచి చూడాలి అయితే ఈ సినిమా కోసం నాగశౌర్య పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఏకంగా పాదయాత్ర కూడా చేసి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచినప్పటికీ ఈ సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకోలేకపోయింది అని మనం చెప్పొచ్చు..