పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత తన లక్ పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు . ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు అన్ని ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలే అని చెప్పవచ్చు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు విడుదలై భారీ డిజాస్టర్ ని చవిచూశాయి. ఇక ప్రస్తుతం ఆది పురష్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా టీజర్ గత కొద్దిరోజులు కిందట విడుదలవాగా ఈ సినిమా పైన కూడా ట్రోల్స్ వినిపించాయి.


ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ బ్యాడ్ లుక్ లో ఉన్నారంటూ పలు వివాదాలు, నిరసనలకు గురిచేలా చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ డైరెక్టర్ మారుతీతో ఒక సినిమాని మొదలుపెట్టబోతుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అందులో మారుతి పక్కా కమర్షియల్ సినిమాతో డిజాస్టర్ గా ఉన్నారు. అయితే ఇతనిపై ఆడియన్స్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేక ఉన్నారు. మళ్ళీ నమ్మకం రావాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాలని ప్రభాస్ అభిమానులు ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.


అయితే మొత్తానికి ఏదో రకంగా ఈ సినిమా షూటింగులు మాత్రం మొదలుపెట్టారు. మొదటి షెడ్యూల్ మూడు రోజులు ప్రభాస్ షూటింగ్ పనుల్లో కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మిగిలిన నాలుగు రోజుల్లో నటీనటులతో కొన్ని సన్నివేశాలను సూట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇందులో పృథ్వి కుమార్ వైవాహర్ష కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే మారుతి అడ్వాన్స్ ఇవ్వడం వల్ల భారీ సినిమా షూటింగ్ సెట్స్ నిర్మించడం వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టక తప్పలేదని టాక్ వినిపిస్తోంది. అందుచేతనే ఎలాంటి హడావిడి లేకుండా సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.అయితే ఇప్పుడు ఒక కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది ప్రభాస్ మొదటి షెడ్యూల్ ఎలా వచ్చింది అని దానిమీద ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందా లేదా అని కండిషన్ పెట్టినట్లుగా సమాచారం. మరి మారుతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: