బాలీవుడ్ స్టార్ లేడీస్ దీపికా పదుకొనె, కత్రినా కైఫ్స్ మంచి మిత్రులు. వీరిద్దరూ హీరో రన్బీర్ కపూర్ తో డేటింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారటా.

మొదట కత్రినా కైఫ్ తో ప్రేమాయణం నడిపిన రన్బీర్, అనంతరం దీపికా పదుకొనెతో డీప్ లవ్ లో పడ్డాడు. రన్బీర్ ఇచ్చిన షాక్ కి దీపికా కోలుకోలేదు. సీరియస్ గా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన దీపికా బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కి గురయ్యారు. కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. కోలుకున్న దీపికా రణ్వీర్ సింగ్ కి దగ్గరయ్యారు. 2018లో దీపికా-రణ్వీర్ సింగ్ వివాహం చేసుకున్నారటా..



కాగా దీపికా పదుకొనె తాజాగా ఓ ఆసక్తికర సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీపికా జిమ్ లో ఏరియల్ యోగ చేస్తున్నారు. దీపికా యోగా చేస్తుండగా అదే జిమ్ లో ఉన్న కత్రినా కైఫ్ వీడియో తీశారు. కత్రినా తీసిన వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దీపికా పదుకొనె ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నేను యోగా చేస్తుండగా కత్రినా ఏం చేసిందో చూడండి అంటూ కామెంట్ పోస్ట్ చేశారటా.. దీపికా ఇంస్టాగ్రామ్ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక దీపికా ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై బాలీవుడ్ సెలెబ్స్ స్పందిస్తున్నారు.

ఇక ప్రభాస్ మూవీతో దీపికా పదుకొనె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. దిశా పటాని మరో హీరోయిన్ గా నటించడం గమనార్హం.

 

కాగా దీపికా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కె షూటింగ్ లో దీపికా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి దీపికాను తరలించారు. పలుమార్లు దీపికా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారట. ఆమె మానసిక వ్యాధితో ఇబ్బందిపడుతున్నారన్న ప్రచారం ఉంది. చాలా కాలంగా చికిత్స తీసుకున్న దీపికా మానసిక రుగ్మత నుండి బయటపడలేకున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: