
డైరెక్టర్ ప్రభాస్, మారుతి కాంబోలో రాబో తున్న లో ముగ్గురు కథా నాయికలు ఉండనున్నారట. అందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కన్ఫార్మ్ కాగా.. ఇప్పుడు మరో కథానాయిక ఎంపికైందట. ప్రభాస్ సరసన మరో హీరోయిన్ గా కన్నడ ముద్దు గుమ్మ ఆశికా రంగనాథ్ ఫైనల్ అయినట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆశికా ఈ మూవీ చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చినట్లు గా సమాచారం. ఈ మూవీ మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత మనవళ్ల కథ అని టాక్. హార్రర్ కామెడీ నేపథ్యం లో ఈ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శక త్వం లో సలార్ చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ కథా నాయిక గా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ కె తెరకెక్కు తుంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్ కీలకపాత్ర లో నటిస్తున్నారు.