బాలీవుడ్ సీనియర్ నటి , అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ బాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వాట్‌ ది హెల్ నవ్య పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆమె ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల పై  ఇలా స్పందించారు అమే

ఈ సందర్భంగా తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా కూడా ఇచ్చి  అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఈ నటి. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడల ప్రకారం తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి కాకుండా తల్లయినా ఫర్వాలేదని.. తనకేలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె పై ఇలా.

జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఈ తరాని కి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... నేను చాలా వైద్య పరమైన మార్పులు చాలా చూశాను. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే రొమాన్స్ చేసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. నవ్య మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. నీకు మంచి స్నేహితుడు ఉండి.. నిన్ను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండా లనుకుంటే.. ఈ సమాజం తో నాకు పనిలేదు. పెళ్లి కాకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య  కుడా లేదు.' అంటూ మనవరాలు నవ్య నవేలి నందకు సలహా ఇచ్చింది ఈ నటి.

ఈ ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని జయా బచ్చన్  ఇలా పంచుకున్నారు. మేం మొదట అక్టోబర్‌లో పెళ్లి చేసు కోవాలని అనుకున్నామని.. అయితే జంజీర్ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని వారి తల్లిదండ్రులు సూచించారని ఆమె  ఇలా చెప్పారు. అందుకే జూన్‌లో పెళ్లి జరిగిందని తెలిపారు , ప్రస్తుతం నా జీవితం చాలా బాగుంది అని,అమితాబ్ తో ఎలాంటి ఇబ్బందులు లేవు అని అమే పేర్కొన్నారు. అంతే కాకుండా జయా బచ్చన్ మాట్లాడుతూ ఈ కాలం మనుషులు చాలా చేదిపోయారు అంటూ ఆమె వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: