అను ఇమ్మానుయేల్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. ఇటీవల వచ్చిన మహాసముద్రం సినిమాలో కూడా నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ఊర్వశివో రాక్షసివో అన్న సినిమా పైనే పెట్టుకుంది. ఈ సినిమా అల్లు శిరీష్ హీరోగా, రాకేష్ శశి దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసింది.


నవంబర్ 4న అంటే ఈరోజు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె మాట్లాడుతూ తన క్యారెక్టర్ గురించి కూడా అసలు విషయాన్ని వెల్లడించింది.. ఇందులో సింధు అనే సాఫ్ట్వేర్ అమ్మాయిగా అను నటించింది. కెరీర్ లో మంచి స్థాయికి ఎదగాలన్న తపన ఉన్న అమ్మాయి సింధు .. ఆమెకు ప్రేమ కావాలి.. కానీ ప్రేమ జీవితం అనుకోదు .. అలాంటి అమ్మాయికి శ్రీ కుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు..ఆ కుర్రాడికి.. ఈ  అమ్మాయికి మధ్య ప్రేమ ఎలా నడిచింది? అన్నది ఊర్వశివో రాక్షసివో సినిమా కథ.

ఈ సినిమాలో సింధు పాత్ర ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా నా క్యారెక్టర్ అలాంటిదే అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది . రియల్ లైఫ్ లో కూడా తాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని కెరియర్ లో తాను వేసే ప్రతి అడుగు వెనుక  పై స్థాయికి వెళ్లాలని ఆలోచన ఉంటుందని ఈమె తెలిసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: