మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వి కపూర్ ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి ప్రస్తుతం హిందీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జాన్వి కపూర్ ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ , మిలి మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో గుడ్ లక్ జెర్రీ మూవీ డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాగా ,  మిలి మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం మిలి మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ కు అనేక సంవత్సరాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక ఆఫర్ లు వస్తున్నట్లు , అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పటివరకు ఆ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. అలాగే జాన్వి కపూర్ కూడా ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త కూడా బయటికి రాలేదు. కాకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా  ఈ ముద్దుగుమ్మను నటించడానికి చిత్ర బృందం సంప్రదించగా ,  జాహ్న కపూర్ ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తో పాటు తమిళ సినిమాలో ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తేరకేక్కబోయే మూవీ లో కూడా జాహ్న కాపూర్ నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: