పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ భారీగా అంచనాలు ఉన్నాయి..ప్రభాస్ సినిమాలు అంటే అంచనాలు ఎక్కువగానే ఉంటాయి..మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ తెరకెక్కనున్నట్లు వచ్చిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నాడు.


ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాఫ్లో ఓ కీలక పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా దానికి దానికి వర్మ సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. త్వరలోనే వర్మకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తన దర్శకత్వ ప్రతిభతో యావత్‌ ఇండియా ను ఆకట్టుకున్న రామ్‌గోపాల్‌ వర్మ తొలిసారి మరో చిత్రంలో నటుడిగా కనిపిస్తుండడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.


ఈ విషయం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా మారింది. ఇంతకీ నాగ అశ్విన్‌ రామ్‌గోపాల్‌ వర్మ ను ఎలా చూపించనున్నాడు, అతని ఎలాంటి రోల్‌ ఇవ్వనున్నాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో ఇతివృత్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వచ్చాయి. 2024 వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: