మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన   కియరా  అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ మూవీ లో నటించారు. ఆ మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా , అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కాస్త డిలే అవుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని శంకర్ తన పూర్వపు మూవీ ల మాదిరి గానే అత్యంత రిచ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని పాటలు మరియు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ సి 15 మూవీ షూటింగ్ ఇంకా మూడు నెలల బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆరో నెల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: