టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా  మంచి పేరు తెచ్చుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన ఈమె మొదట తమిళం లో నటించి ఆ తర్వాత ఫోటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది.అనంతరం షాపింగ్ మాల్ సినిమాతో చక్కటి ప్రతిభను కనబరిచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాని అనంతరం జర్నీ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. తరువాత  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో స్టార్ హీరోయిన్ పేరును పొందింది. 

సినిమా తర్వాత అంజలి దిశా తిరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు .బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించినప్పటికీ స్టార్ హోదా మాత్రం పొందలేదు. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించేందుకు సిద్ధమైంది ఈమె.దాంతోపాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది .అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అంజలికి సంబంధించి ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందని భర్తతో అమెరికాలో కాపురం కూడా పెట్టిందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా అంజలి అసలు గుట్టు రట్టు చేసింది.

అయితే ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫాలో... ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్, సంతోష్ ప్రతాప్ తదితరులు ఇందులో నటించారు .సిద్ధార్థ రామస్వామి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి అక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆమె చాలా విషయాలను చెప్పుకొచ్చింది. వాటితోపాటు తన పెళ్లిపై వస్తున్న వార్తలు గురించి కూడా చెప్పింది. అయితే తనకు ఇదివరకే పెళ్లి అయిపోయింది అని అమెరికాలో కాపురం కూడా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకుని ఆలోచన కూడా లేదని కానీ పెళ్లి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానని ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే తప్పకుండా చెబుతానని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: