ఇటీవల కాలంలో సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ ప్లే చేయడానికి అయినా సరే నటీనటులు ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డి గ్లామర్ పాత్రలు చేయడానికి మరింత ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. బయట సహజంగా ఎంతో అందంగా ఉండే వాళ్ళు సైతం పాత్రల్లో సహజత్వం కనిపించాలి అనే ఉద్దేశంతో మేకప్ లేకుండానే కెమెరా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవలే కాంతార సినిమాను చూసే ఉంటారు. ఏకంగా నాచులారిటీకి దగ్గరగా ఉంది. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయింది. 18 కోట్లతో తెరకేక్కిన ఈ సినిమా 400 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.


 ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పాలి. కాగా హీరో రిషబ్ శెట్టి తల్లి పాత్రను పోషించింది మానసి సుధీర్. కమల అనే వయసు మీద పడిన మహిళగా నటించింది. ఇక సినిమా మొత్తం బాధ్యత లేని కొడుకును చిత్తక్కొడుతూ తిడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి తల్లిగా బాగా వయస్సు మీద పడిన మహిళగా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఇలా ఒక ముసలావిడలా కనిపించిన కమల పాత్రలో నటించిన నటి బయట మాత్రం ఎంతో అందంగా కనిపిస్తుంది.



 అయితే ఇక కాంతార సినిమాలో ఈమె పాత్ర చూసిన తర్వాత సీనియర్ నటి అయ్యుంటుంది. అందుకే ఈ ఆఫర్ వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈమె చేసిన టిక్ టాక్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఆ సమయంలోనే కేజిఎఫ్ నిర్మాతలు ఆడిషన్ కు పిలిచి పాత్ర గురించి చెప్పారు. ఇలా 35 ఏళ్ల వయసులో ఏకంగా హీరోకి తల్లి పాత్రలో నటించి తన నటనతో మెప్పించింది. అయితే రిషబ్ శెట్టి వయస్సు 39 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇలా తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్ద అయినా హీరోకి తల్లి పాత్ర చేసింది. కాగా ప్రస్తుతం మానసి సుధీర్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: