రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అందులో భాగంగా ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ప్రభాస్ సరసన ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్ లుగా నటించబోతున్నారు. సంజయ్ దత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒకే సెట్ లో జరగబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ హర్రర్ కామెడీ నేపథ్యం లో రూపొందినున్నట్లు , ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి అద్భుతమైన టాలెంట్ ఉన్న సినిమాటో గ్రాఫర్ అయినటు వంటి కార్తీక్ పలాని సినిమాటో గ్రఫర్ గా వ్యవహరిస్తున్నాడు. కార్తీక్ పలాని ఇప్పటికే ప్రభాస్ హీరో గా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేశాడు. అలాగే మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉన్నా తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారిసు మూవీ కి కూడా సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: