సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అభివృద్ధి చెందాలంటే కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ స్క్రీన్ ప్లే తో మాయ చేయాలి. అపుడే చిన్న సినిమా తీసిన పెద్ద నిర్మాతలు మరియు హీరోల దృష్టిలో పడి మంచి ఆఫర్ లు వస్తాయి. కానీ కొన్ని సార్లు అనుకోకుండా పెద్ద స్టార్ లతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా , ఎక్కువ అతితో చేజేతులా మంచి అవకాశాలను డిజాస్టర్ మూవీలను తెరకెక్కించి కెరీర్ ను పాడుచేసుకుంటూ ఉంటారు. ఇలాంటి దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. అయితే అలా ఫెయిల్యూర్ మూవీస్ తీసిన డైరెక్టర్స్ కు మళ్ళీ అవకాశాలు రావడం అంటే సాధారణమైన విషయం కాదు.

కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కెరీర్ లో వచ్చినా రెండు అవకాశాలను వాడుకోవడంలో విఫలం అయిన యంగ్ డైరెక్టర్ కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. "జిల్" సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ గురించి తెలిసిందే. గోపిచంద్ హీరోగా నటించిన ఈ మూవీ అంతగా తీసేసేది కాకపోయినా ఎందుకో బాక్స్ ఆఫీస్ పరంగా నిరాశపరిచి రాధాకృష్ణకు సక్సెస్ ను అందించలేకపోయింది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది యూవీ క్రియేషన్స్ వారు అని తెలిసిందే.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన దృష్టిలో ఒక మంచి ప్రేమకథను రాసుకున్నాడు. ఈ కథను టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు చెప్పి ఒప్పించాడు. అలా రాధేశ్యామ్ లాంటి ఒక అద్భుతమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు రాధాకృష్ణ.

కానీ ఈ సినిమా కూడా రాధాకృషను కాపాడలేకపోయింది. ప్రభాస్ ను ఒక మంచి ప్రేమికుడిగా ప్రెజెంట్ చేసే క్రమంలో తీవ్రంగా కన్ఫ్యూజ్ అయ్యి అసలు పాయింట్ ను గాలికి వదిలేసి ఎలివేషన్ ల మీద దృష్టి పెట్టాడు. ఫలితంగా ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా రాధేశ్యామ్ మిగిలింది. అలా రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తాజాగా మరో మంచి కథను తమిళ స్టార్ హీరో ధనుష్ కోసం రెడీ చేసి.. కథను చెప్పగానే ధనుష్ కూడా ఒకే చెప్పాడట. ఇప్పుడు ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ వారే నిర్మాతగా వ్యవహరించనున్నారట. మరి ఈ సినిమా అయిన రాధాకృష్ణకు హిట్ ను అందిస్తుందా లేదా చూడాలి. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసిన ఇండస్ట్రీ అంతా షాక్ కు గురవుతోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: