సాధారణంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో అస్సలు అర్థం కావు. అయితే మొన్నటి వరకు మెగా కోడలు ఉపాసన సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అలా చేయమని చెప్పింది తన స్నేహితురాలు అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక దానికి సంబంధించి గట్టి క్లారిటీ కూడా ఇచ్చింది మెగా కోడలు. దీని అనంతరం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 అయితే రానా కి ఏదో ఆరోగ్య సమస్య ఉందని ఆ కారణంగానే రానాకి పెళ్ళయి ఇన్ని రోజులు కావస్తున్న పిల్లలు లేరు అని అందుకే రానా మరియు ఆయన భార్య ఎప్పుడూ హాస్పటల్ చుట్టూనే తిరుగుతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు రానా అపోలో హాస్పిటల్లో దీనికి సంబంధించిన చికిత్సను కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది.అయితే దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. అంతేకాదు ఈ వార్తపై ఇప్పటివరకు రానా గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎవరు అధికారిక ప్రకటన చేయలేదు.

రానా భార్య మిహిక కూడా దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో గాని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఉట్టి పుకార్లే అని ఈ వార్త విన్న చాలా మంది రానా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు రానా ఫ్యాన్స్ చాలామంది ఇలాంటి రూమర్స్ తగ్గాలి అంటే ఈ వార్తకి సంబంధించి రానా లేదా ఆయన భార్య మరియు కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది అని ఎంత త్వరగా ఈ వార్తలకు చెక్ పెడితే రానాకి అంత మంచిది అంటూ కోరుకుంటున్నారు. ఇక ఈ వార్త నిజమా కాదా తెలియాలి అంటే కచ్చితంగా రానా ఈ వార్తలపై స్పందించాల్సిందే అంతవరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాదు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: