జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన గెటప్ లు వేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు గెటప్ శీను. గెటప్ శ్రీను అంటే ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులకే కాదు జడ్జీలు అయిన రోజా నాగబాబులకు సైతం శ్రీను అంటే అమితమైన ఇష్టం. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను. త్వరలోనే రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా కూడా పరిచయం కానున్నాడు. ఇదిలా ఉంటే ఇక తాజాగా గెటప్ శ్రీను ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

 ఇందులో భాగంగా గెటప్ శ్రీను మంత్రి రోజాను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలను చేయడం జరిగింది. అయితే గెటప్ శ్రీను చిరంజీవి కి పెద్ద ఫ్యాన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.మెగా కుటుంబానికి కూడా గెటప్ శ్రీను పెద్ద ఫ్యాన్. అయితే ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి మంత్రి రోజా చేసిన కొన్ని వ్యాఖ్యలు పై గెటప్ శ్రీను స్పందించాడు.ఇందులో భాగంగా గెటప్ శ్రీను.. సేవా గుణ.. దాణా గుణం తెరిచిన పుస్తకం.. ఒక స్ఫూర్తి మరి మీకెందుకు కనబడలేదో రోజా గారు.. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి..మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు కోల్పోకండి..

మీ నోటి నుండి ఇలాంటి పచ్చి అబద్ధాలు వినాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.. దయచేసి మీ మాటలని వెనక్కి తీసుకోండి అంటూ ..తన సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చాడు గెటప్ శీను. ఇక ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సాధారణంగా ఎప్పుడు ఏలాంటి వివాదాల్లోకి తల దూర్చాడు శ్రీను. ఇప్పటివరకు ఆయనపై ఒక్కరిమార్క్ కూడా లేదు అంటే ఈయన ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని గెటప్ శీను ఎందుకు ఇంత ఫైర్ అయ్యాడు అన్నది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. ఇందుకుగాను మెగా అభిమానులు గెటప్ శ్రీనుకి తోడుగా నిలబడ్డారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: