స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాడు డైరెక్టర్ గుణశేఖర్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను తెరకెక్కించాడు ఈయన. ఇటీవల ఆయన తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాని అనంతరం తాజాగా ఇప్పుడు షాకుంతలం  సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. 

ఇక ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ గుణశేఖర్ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా గుణశేఖర్ సమంత గురించి మాట్లాడుతూ... శకుంతల పాత్రకు చాలామందిని అనుకున్నాము..ఇక మా అమ్మాయి నీలిమ యుకె నుండి వచ్చిన అనంతరం నిర్మాతగా మారుతానని చెప్పి మంచి కథ చెప్పమంది. నేను ముందుగా సోషల్ కద చెప్పాను. కానీ నేను పాతికేళ్లు ముందు తీసిన రామాయణం తరహా మైథిలాజికల్ కదా చెప్పింది మా అమ్మాయి. ఇక అప్పుడే షాకుంతలం సినిమా సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇప్పటి జనరేషన్ కు మన భారతీయ సంస్కృతి గొప్పతనం అంటే ఏంటో అందరికీ తెలియజేయాలి అని తన విజయంలో కావ్య నాయకి సమంత.

అయితే ఆమె చాలా మోడ్రన్ గా ఉంటుంది కదా అని అనిపించినప్పటికీ సమంత అయితే ఈ పాత్రకి ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఇక అప్పుడు సమంత గతంలో చేసిన రామలక్ష్మి పాత్ర నాకు గుర్తొచ్చింది. అయితే ఎంతో మోడ్రన్ ఉండే సమంత విలేజ్ అమ్మాయిల నటించి ఎందరినో మెప్పించింది. ఇక సమంతకు కథ చెబుతున్న సమయంలో శకుంతలాగా సమంత నాకు పర్ఫెక్ట్ అనిపించింది. కానీ ఈ సినిమాను తీయాలంటే చాలా కోట్లు కావాలి.ఇక ఆ సమయంలోనే దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు. ఇక దిల్ రాజు గారు మాట్లాడుతూ.. సమంత ఒక స్టార్ హీరోయిన్ మీరు తనకి మంచి కథ  ఇచ్చారు.  ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేసి సినిమాని బాగా తీయండి అంటూ అన్నారు. ఇక అన్ని కోట్లు దిల్ రాజు ఖర్చు చేసి నాపై నమ్మకంతో ఈ సినిమాను చేయమని భరోసా ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి.ఈ  సినిమా మన సంస్కృతి పౌరాణిక సినిమాలు ఇప్పుడు చూద్దామంటే కరువయ్యాయి. అలాంటి పరిస్థితి భవిష్యత్తు తరాలకు రాకూడదు అని భవిష్యత్తు తరాలకు ప్రామాణికంగా ఉండాలి అని మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం  బేస్ చేసుకుని ఈ సినిమాను తీశాను అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ గుణశేఖర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: