జూనియర్ ఎన్టీఆర్ హీరోగా  నటించిన యమదొంగ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మమతా మోహన్ దాస్ కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ గా  కూడా ఈమె మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఈమె ఒక అరుదైన వ్యాధి బారిన పడింది అని తెలుస్తోంది.తెలుగులో ఈమె చాలా సినిమాలలో నటించడం జరిగింది. అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా తాను వ్యాధితో బాధ పడుతున్నాను అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే చాలా ఏళ్ళ క్రితం ఈమె క్యాన్సర్ బారిన పడింది. 

దానికి సంబంధించిన చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ నుండి కోలుకుంది. దాని అనంతరం లింఫోమా అని వ్యాధి బారిన పడింది ఈమె. ఆ వ్యాధి నుండి కూడా కోలుకుంది. తాజాగా బోల్లి అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందట ఈ నటి. ఈ వ్యాధి వల్ల ఆమె చర్మం రంగును కోల్పోయింది మమత మోహన్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది. క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తో తాను గత కొంతకాలంగా బాధపడుతుంది అంటూ వెల్లడించింది. ఇక ఆ పోస్ట్ ద్వారా తన ఈ వ్యాధితో బాధపడుతుంది 

అని తెలుసుకున్న చాలామంది నెటిజన్స్ తను త్వరగా ఈ వ్యాధి నుండి కోలుకోవాలి అని కోరుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యాధి కొంతమేరకు ప్రమాదకరమని అయినప్పటికీ దీనికి సంబంధించిన సరైన చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చు అని తెలుస్తుంది. ఇక మలయాళం మూవీ జనగణమన సినిమాలో నటించిన ఈమె అదే తన చివరి సినిమా అయ్యింది. వ్యాధి నుండి త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలో రావాలని భావిస్తున్నారు ఈమె అభిమానులు. దీంతో మమతా మోహన్ దాస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: