పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి విడుదలకి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్.ఇక ఇప్పుడు సలార్ ఇంకా ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకా అలాగే మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న మూవీ షూటింగ్ కూడా సైలెంట్ గా చేస్తున్నాడు. ఇంకా ఇవే కాకుండా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో కూడా ప్రభాస్మూవీ చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఇందులో తొలిసారి యంగ్ రెబల్ స్టార్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.


ఇక నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి రణబీర్ ఇంకా రష్మిక జంటగా నటిస్తోన్న యానిమల్ షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులు స్టార్ట్ చేయనున్నారు. ఈ సంవత్సరం చివరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైన పోలీస్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝళిపించనున్నారు. ఇంకా అలాగే.. ఈ మూవీకి మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ విషయం మాత్రం నేను చాలా కచ్చితంగా చెప్పగలను. ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని ప్రభాస్ ను ఈ సినిమాలో చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.ఇక నిర్మాత భూషణ్ కుమార్ కామెంట్స్ పై చాలా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ టైం యంగ్ రెబల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడంతో ఈ మూవీపై ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: