తమిళ విలక్షణ నటుడు విజయసేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం కెరియర్లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈ తమిళ హీరో. తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే విజయ్ సేతుపతి కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా తన బిహేవియర్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల నుంచి విజయసేతుపతిని ఓ వివాదం వెంటాడుతూ వస్తోంది. రెండేళ్ల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తితో విజయసేతుపతి గొడవపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. 

అయితే తనపై విజయ్ సేతుపతి మరియు అతని మనుషులు దాడి చేశారంటూ కోర్టులో మహా గాంధీ అనే వ్యక్తి కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం ఆ కేస్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే తాజాగా విజయ్ సేతుపతికి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెలబ్రిటీ హోదాలో ఉన్న మీరు ఇలా పబ్లిక్ లో బిహేవ్ చేయకూడదు అంటూ చురకలు అంటించింది. ప్రజల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలని విజయ్ సేతుపతి కి గుర్తు చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ విషయంలో విజయ్ సేతుపతి, మహా గాంధిలను ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడి పరిస్థితి సర్దుమణిగేలా చేయడానికి సుప్రీంకోర్టు ట్రై చేస్తున్నట్లు సమాచారం.

ఇక అది వాళ్లకి ఇష్టమైతే తదుపరి విచారణకు కోర్టుకు హాజరు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ సేతుపతిని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక స్టార్ సెలబ్రిటీగా ఉండి ఇలాంటి బిహేవియర్ ఎలా చేసావ్ అంటూ విజయ్ సేతుపతి పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో పుష్ప2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే విజయ్ సేతుపతి కూడా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు తెలుగులో మరి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: