టాలీవుడ్ లోకి హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా మారి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ వెంటనే డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో గీతా గోవిందం సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ పరశురాం మహేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా అని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తన తదుపరిచిత్రాన్ని నాగచైతన్యతో చేయవలసి ఉండగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చైతన్య, పరశురాం మధ్య కాస్త సందిగ్ధం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ క్రమంలోని రీసెంట్గా పరుశురాం, విజయ్ దేవరకొండ తో కలిసి గీతా గోవిందం -2 చిత్రాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాను టాలీవుడ్ లో అగ్ర నిర్మాత దిల్ రాజుతో నిర్వహించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. దీంతో అల్లు అరవింద్ కోపంతో పరశురాం పైన ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో గీత ఆర్ట్స్ లో చేయవలసిన సినిమాలను దిల్ రాజుతో ఎలా చేస్తారు అంటూ మాతో చేయవలసిన సినిమా సంగతేమిటి అని అక్కడికక్కడే నిలదీసినట్లుగా తెలుస్తోంది.


ఇక అల్లు అరవింద్ దగ్గర పరుశురాం అడ్వాన్స్ తీసుకున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కారణంగానే అల్లు అరవింద్ కి బాగా కోపం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అల్లు అరవింద్ కారణంగానే పరుశురాం, విజయ్ దేవరకొండ సినిమా కాస్త హోల్డ్ గా ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ తో అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారా.? లేకపోతే దిల్ రాజుతో ఈ సినిమాని నిర్మిస్తారా ?అనే విషయం తెలియాల్సి ఉంది. అల్లు అరవింద్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: