టాలీవుడ్  సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదట్లో విలన్ గా చేస్తూ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి దాని అనంతరం సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిగా చలామణి అవుతున్నాడు. చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోగా ఎప్పటికీ గుర్తుండిపోతాడో ఆయన ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు పొందడం అంటే దీనంతటి వెనక ఎంత కష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి నటించిన ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు అంటూ చాలామంది అంటూ ఉంటారు .కానీ దానికి సంబంధించిన ఒక విషయం ఎప్పుడో వైరల్ అవుతుంది. 

ఇక అసలు విషయం ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలు పరంగా ఎక్కువ కలెక్షన్లను రాబట్టే సత్తా ఉన్న హీరో ఎవరు అంటే కచ్చితంగా చిరంజీవి పేరు వినిపిస్తుంది.  ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉండేది. అనేకసార్లు చిరంజీవి సినిమాకి ఎన్టీఆర్ గెస్ట్ గా కూడా వెళ్లిన సందర్భంలో ఉన్నాయి.కానీ ఒక్క సినిమా మాత్రం ఎన్టీఆర్ కారణంగా చిరంజీవిని స్టార్ హీరో చేసింది అని అంటున్నారు. గతంలో ఇవివి సత్యనారాయణ స్టార్ డైరెక్టర్ గా ఉండేవారు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏకైక సినిమా అల్లుడా మజాకా. ఈ సినిమా తర్వాత నుండి వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

ఘరానా అత్తకు అల్లుడికి మధ్య జరిగే టీజింగ్ డ్రామా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా 1994 ఆగస్టు 26న సీనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా మొదలు పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందుగా వేరొక గెస్ట్ ని అనుకున్నారు. కానీ ఈ సినిమా నిర్మాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులు కావడంతో సీనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకువచ్చారు. సంజీవయ్య పార్క్ లో ఈ సినిమాకి సంబంధించిన పలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక 1995 ఫిబ్రవరి 25న ఈ సినిమాని సీనియర్ ఎన్టీఆర్ మరియు చిరంజీవి ఇద్దరు కలిసి చూశారు. అప్పట్లో ఏ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: