95 వ ఆస్కార్ వేడుకలు ఈనెల 12వ తేదీన అమెరికాలోని లాస్ట్ ఏంజెల్స్ లో జరగబోతున్నాయి ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 13 ఉదయం 5:30 గంటల నుండి స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే ఇది ఎలా ఉండగా ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆస్కార్ పురస్కారాలు పొందిన భారతీయులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.. యావత్ సినీ ప్రపంచం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్ అవార్డులు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 94 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు ఈ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారో మీకు తెలుసా..?

ఇకపోతే ఇప్పుడు మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లో జరగనున్న 95 వ ఆస్కార్ వేడుకల సందర్భంగా ఈ వివరాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. భారత తొలి ఆస్కార్ విజేతగా భాను అథైయా 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకలలో ఆమె ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించి చరిత్ర పుటల్లో నిలిచారు.. 1982లో విడుదలైన గాంధీ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. 1992లో దర్శక దిగ్గజం సత్యజిత్ రే ఏ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత భారతీయులు ఆస్కారం అందుకోవడానికి దాదాపు 17 సంవత్సరాల సమయం పట్టింది. 2009లో జరిగిన 81వ ఆస్కార్ వేడుక ఆ లోటును భర్తీ చేయడం గమనార్హం.

అయితే ఈసారి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ఆస్కార్ అవార్డులను భారతీయులు సొంతం చేసుకున్నారు.  అందులోను ఒకే సినిమాకు అదే స్లమ్ డాగ్ మిలియనీర్.. ఈ చిత్రానికి గాను బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి , రిచర్డ్ ప్రైక్ , ఇయాన్ టాప్ తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది.. ఇక తర్వాత ఏఆర్ రెహమాన్ కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: