టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పటి సీనియర్ నటి లయ అందరికి గుర్తుందే ఉంటది.ఐతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా లో తన గురించే చర్చ. చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఐతే లయ అంటే ఈ జనరేషన్ యూత్ కు తెలియకపోవచ్చు కానీ నైంటీస్ కిడ్స్ కి లయ సుపరిచితమే. అప్పట్లో లయ స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు 5 ఏళ్ల పాటు అందరు స్టార్ హీరోల సరసన నటించి అలరించింది లయ.

ఆ తర్వాత సడెన్ గా సినిమా ఇండస్ట్రీ కి దూరం అయింది. పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. కొన్ని నెలల కిందనే భారత్ కు వచ్చిన లయ.. మళ్లీ ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య తను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే తన పర్సనల్, సినిమా లైఫ్ కు సంబంధించిన చాలా విషయాల ను ఆమె షేర్ చేసుకుంది. ఇక లయ తాజా గా తిరుమల శ్రీవారి ని దర్శించుకుంది.

తనకు పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తొలిసారి లయ తిరుమలను దర్శించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి లయ తిరుమల ను దర్శించుకుంది. తిరుమల లో లయను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఆమె మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆమె వెంట తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తిరుమలలో లయకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐతే కొంతమంది నేటిజన్లు మాత్రం ఎపుడు లేనిది ఇన్నేళ్ల తర్వాత దర్శించుకోడానికి కారణం మరల తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం అని నెట్టింటా కొంతమంది అంటున్నారు. ఐతే చూడాలి మరీ దీనికి గాను లయ ఎలా స్పందిస్తారో…

మరింత సమాచారం తెలుసుకోండి: