రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని ప్రాజెక్టుల కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ క్రేజ్ అయితే పెరిగిపోయింది. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస కు హిట్టు మాత్రం లభించడం లేదు. సాహో, రాధాశ్యామ్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.


 కానీ ఈ రెండు ప్రేక్షకాదరణ నోచుకోవడంలో మాత్రం విఫలం అయ్యాయి. దీంతో ఇక ప్రభాస్ కెరియర్ లోనే ఫ్లాపులు గానే మిగిలిపోయాయి ఈ పాన్ ఇండియా సినిమాలు. ఇక ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకేక్కిన ఆది పురుష్  అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న ఆది పురుష్ సినిమా ఇక ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇటీవల  విడుదలైన ఆది పురుష్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.



 ఈ క్రమంలోనే అన్ని భాషల్లో కలిపి ఓవరాల్గా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది ఆదిపురుష్ సినిమా. ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ రెబల్ స్టార్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రభాస్ కు సంబంధించిన అన్ని సినిమాల ట్రైలర్స్ కూడా 100 మిలియన్ న్యూస్ రాబట్టాయి అని చెప్పాలి. దీంతో డార్లింగ్ పేరిట ఒక యూనిట్ రికార్డు నమోదయింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎక్కువ సినిమాలు 100 మిలియన్ న్యూస్ సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: