స్వాతి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కలర్స్ స్వాతి అంటే అందరూ ఇట్టే గుర్తు పట్టెస్తారు. బుల్లితెర నుండి వెడతెరకు పరిచయమైన చాలామందిలో కలర్స్ స్వాతి కూడా ఒకరు. కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత నటిగా పరి సినిమాలలో నటించింది. ఎలాంటి పాత్ర అయిన సరే అవలీలగా చేస్తూ పోతుంది కలర్స్ స్వాతి. తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో సైతం తనదైన నటనతో సినిమాలు చేస్తూ మెప్పించింది ఈమె. ఇక అలాంటి స్వాతి మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ఆకట్టుకుంది.

 2008లో వచ్చిన అష్ట చమ్మ సినిమాతో ఈమెకి హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ సినిమాలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాకు కలర్స్ స్వాతికి నంది పురస్కారం సైతం లభించింది. ఇక ఆ సినిమా తర్వాతే ఈమెకు వరుసగా సినిమాలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకో హాజరైంది కలర్స్ స్వాతి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకుంది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా స్వాతి మాట్లాడుతూ.. నా కెరియర్ లో నేను చాలా ఒడిదొడ్లను ఎదుర్కొన్నాను.. ఒక సినిమా చేసిన తర్వాత మరొక సినిమా అవకాశం రాదని అనుకున్నాను..

అనంతరం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకటేష్కు మరదలుగా చేసే అవకాశం వచ్చింది.. ఇక ఆ సినిమాలో నటించినందుకు నాకు మంచి గుర్తింపు వచ్చింది.. కానీ ఆ సినిమాలో మరదలు పాత్ర నటించినందుకు తర్వాత సినిమాలో కూడా మరదలు పాత్రలో నటించే అవకాశాలు వచ్చాయి.. కానీ అలా చేయడానికి నేను ఇష్టపడలేదు.. అలా చేస్తే నాకు పడిపోతుందన్న ఉద్దేశంతో చేయలేదు.. కానీ గ్రాఫ్ పడిపోతుంది అనుకున్నాను.. కానీ అలా వదులుకున్న ప్రతి సినిమా ఏదో ఒక హిట్టు పడేది.. అలా ఇప్పుడు నేను చెప్పుకోవడానికి కొన్ని హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.. స్వామి రారా ,సుబ్రమణ్యం ,కార్తికేయ లాంటి సినిమాలతో నాకు మంచు గుర్తింపు వచ్చింది. అనంతరం డేంజర్ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాలో చేసినందుకు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నేను అస్సలు పట్టించుకోలేదు. అంటూ చెప్పింది కలర్స్ స్వాతి. దీంతో కలర్స్ స్వాతి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కలర్స్ స్వాతి మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: