లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తర్వాత పెళ్లి చూపులు మూవీతో హీరోగా టర్న్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఒక్కసారిగా విజయ్ కి హీరోగా అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో అర్జున్ రెడ్డి మూవీ విజయ్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. ఏకంగా రౌడీ స్టార్ అనే బ్రాండ్ క్రియేట్ చేసింది.

మూవీ తర్వాత గీతాగోవిందం విజయ్ కెరియర్ లోనే అతి పెద్ద సక్సెస్ అని చెప్పాలి. నెక్స్ట్ ట్యాక్సీవాలా కూడా మంచి హిట్ అయ్యింది. తరువాత డియర్ కామ్రేడ్ మూవీ బాగుందనే టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ కాలేదు. వరల్డ్ ఫేమస్ లవ్ కూడా అలాగే కమర్షియల్ ఫెయిల్యూర్ గా మారిపోయింది. ఇక గత ఏడాది లైగర్ అతని కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్.

ప్రస్తుతం ఖుషి మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని విజయ్ దేవరకొండ అనుకుంటున్నారు. రామ్ చరణ్ మిస్ చేసుకున్న స్టొరీతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ కాప్ స్టొరీ చేస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కూడా కెరియర్ లో కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నాడు. కథలు విని ఒకే చెప్పిన తర్వాత ఇమేజ్ బ్యారియర్స్ కారణంగా చేయలేకపోయాడు.

అలాంటి వాటిలో ప్రస్తుతం రాబోతున్న అన్ని మంచి శకునములే మూవీ కూడా ఒకటి. నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కింది. అర్జున్ రెడ్డికి ముందే ఈ కథని నందిని రెడ్డి విజయ్ దేవరకొండకి నేరేట్ చేసిందంట. అతనికి కూడా కథ భాగా నచ్చడంతో చేద్దామని ఫిక్స్ అయ్యారంట.

అదే సమయంలో అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆడియన్స్ విజయ్ ని రౌడీ స్టార్ గా రిసీవ్ చేసుకున్నారు. దీంతో ఆ ఇమేజ్ తో విజయ్ తన స్టొరీకి సెట్ కాడని కొన్నేళ్ళు ఈ కథని పక్కన పెట్టడం జరిగింది. మరల ఓ బేబీ తర్వాత స్వప్న దత్ కి చెప్పడం జరిగిందంట. ఆమె సంతోష్ శోభన్ ని సూచించింది. అతనికి స్క్రీన్ టెస్ట్ చేయడం, స్టొరీకి సెట్ కావడంతో పట్టాలు ఎక్కినట్లు నందినిరెడ్డి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా అన్ని మంచి మంచి శకునములే మూవీని విజయ్ మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: