డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ సూపర్ క్రేజ్ తో వస్తుంది. ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే రిలీజ్ అవుతుండగా ఆమె తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై హింట్ ఇచ్చింది. యువ హీరోతో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. అది సిద్ధు తోనే అని ఫిక్స్ అయ్యారు.

అయితే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాక్. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ లో రిస్క్ చేయాలని చూస్తుంది. ఆమె చేస్తున్న సినిమాలు కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయి. యువ హీరోలతో కూడా జత కట్టాలని చూస్తుంది సమంత. అందుకే సిద్ధుతో జత కట్టేందుకు సై అనేసిందట. డీజే టిల్లుతో తన టాలెంట్ చూపించిన సిద్ధు రానున్న రోజుల్లో క్రేజీ సినిమాలు చేసేలా ఉన్నాడు.

ఇక ఇదిలాఉంటే సిద్ధు సినిమాలో సమంత అనగానే ఈ కాంబో సూపర్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత సమంత చేసే సినిమా ఇదే అని అంటున్నారు. ఆల్రెడీ నందిని రెడ్డితో రెండు సినిమాలు చేసిన సమంత హ్యాట్రిక్ సినిమా కు లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సమంత సిద్ధు ఈ కాంబో ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. సమంత ఫ్యాన్స్ కి ఈ కాంబో సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇక మీదట అమ్మడు యంగ్ హీరోలతో కూడా నటించి మరోసారి తన కెరీర్ ను ఫాం లోకి తెచ్చుకోవాలని చూస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: