బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది హీరోయిన్ కంగనా రనౌత్. టాలీవుడ్లో మొదట ఏక్ నిరంజన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఈ సినిమాలో కూడా నటించలేదు. బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ అక్కడ పలు సినిమాలలో నటించి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. ముఖ్యంగా తను ఏదైనా విషయాన్ని తెలియజేయాలంటే కచ్చితంగా ఆ విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేస్తూ ఉంటుంది. సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలు హిందుత్వం గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది.


కంగనా రనౌత్ బిజెపి పార్టీకి చాలా మద్దతుగా తెలుపుతున్నటువంటి ఈమె హిందుత్వం గురించి తరపు మాట్లాడుతూ ఉంటుంది.. సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇమే ట్విట్టర్ సీఈవో ఎలన్ మాస్క్ తనకు ఆదర్శం అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. నేను నాకిష్టమైందే చేస్తాను.. నేను నమ్మిన దానిపైనే నిలబడతాను దానివల్ల డబ్బులు నష్టపోయిన పర్వాలేదని వ్యాఖ్యలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది..


తాను కూడా డబ్బుకు ఆశపడకుండా తాను నమ్మిన దానిపైనే నిలబడడమే కాకుండా తనకి ఇష్టమైన పనులు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. తాను చేసే రాజకీయ వ్యాఖ్యల పైన సినీ వ్యాఖ్యల గురించి హిందుత్వం గురించి మాట్లాడడం వల్ల.. కొంతమంది దేశ వ్యతిరేకులు రౌడీ గ్యాంగ్ గురించి మాట్లాడడం వల్ల తనకు కొన్ని సినిమాలలో అవకాశాలను తొలగించడమే కాకుండా మరికొన్ని బ్రాండ్ అంబాసిడర్లను కూడా తొలగించారని దీనివల్ల రూ.30 కోట్ల రూపాయలు నష్టం ఏడాదికి వాటిలిందని తెలుపుతోంది. అయినా ఆ డబ్బు పోయినా నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను నాకు నచ్చినది మాట్లాడుతూ నాకు నచ్చిన విధంగానే ఉంటానని తెలుపుతోంది కంగనా రనౌత్.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: