గత కొంతకాలంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవన్ చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇటీవల వెల్లడించారు. దీంతోపాటు వీరిద్దరు జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. వీరు ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా మీ 26న విడుదల కాబోతుంది. ఇందులో భాగంగానే నరేష్ పవిత్ర ఇద్దరూ వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతూ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

ఇక ఆ ఇంటర్వ్యూలలో భాగంగా సినిమా విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నరేష్ పవిత్రుతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లుగా చెప్పాడు. దాంతోపాటు వారి రిలేషన్ షిప్ ను పెళ్లి కాకుండానే కలిసి ఉండేందుకు తమ ఇరు కుటుంబాలు అంగీకరించినట్లుగా స్వయంగా చెప్పాడు నరేష్ .ఇదిలా ఉంటే ఇక ఇటీవల సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .అందులో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. పవిత్ర తన కుటుంబ సభ్యులందరికీ బాగా దగ్గరయిందని..

ఆమె వంటలను కృష్ణ గారు ఎప్పుడు మెచ్చుకునే వారిని... ఆ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నాడు నరేష్ .దాంతోపాటు తన సవితి సోదరుడైన మహేష్ బాబు కూడా పవిత్రతో నా బంధాన్ని అంగీకరించాడని.. మహేష్ కి పవిత్ర అంటే చాలా ఇష్టమని.. ఇష్టంతో పాటు గౌరవం అని కూడా వెల్లడించాడు. దీంతో నరేష్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఇక ఈ వార్త విన్న మహేష్ అభిమానులు పవిత్ర ఏంటి మహేష్ బాబుకి ఇష్టమేంటి అంటూ రకరకాల కామెంట్స్ ని పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: