ప్రస్తుత కాలంలో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ హవా బాగా కొనసాగుతోంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఇలా విడుదల చేస్తూ అభిమానులను త్రిల్ అయ్యేలా ఫీల్ చేస్తున్నారు.. ముఖ్యంగా పాత సినిమాలను మరొకసారి థియేటర్లోకి తీసుకువచ్చి అభిమానులను ఎగ్జిట్ అయ్యేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలను మరొకసారి థియేటర్లో చూసేందుకు కూడా ప్రేక్షకులు చాలా మక్కువ చూపుతున్నారు. అందుకే రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతున్నట్లు సమాచారం.


సినిమాలను రీ రిలీజ్ చేస్తే బాగానే లాభదాయకంగా ఉంటుందని కృష్ణ సోదరుడు తెలియజేయడం జరిగింది. అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.. అయితే పాత సినిమాలలో చాలా వరకు క్లారిటీ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలను నేరుగా అలాగే రిలీజ్ చేస్తే క్లారిటీ సరిగ్గా లేక సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడడం లేదు. కానీ వాటిని మంచి క్వాలిటీ చేస్తే కాస్త ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. వీటి గురించి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఒక అద్భుతమైన ప్లాన్ తెలిపారు.


సాధారణంగా సినిమా క్వాలిటీ..4K కి మెరుగుపరచడానికి దాదాపుగా రూ .20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.. తక్కువ ఖర్చుతో ఒరిజినల్ ప్రింటును పొందగలిగితే రీ రిలీజ్ కు ఇది కచ్చితంగా లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. రీ రిలీజ్ పాత సినిమాలను చేయాలనుకునే వాళ్ళు ఈ ప్లాను ఒకసారి వర్కౌట్ చేసి చూడండి ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అంటూ తెలిపారు ఆదిశేషగిరిరావు.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. మరి ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: