పవిత్రా లోకేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

నరేష్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. నరేష్  మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. మళ్లీ పెళ్లి ట్రైలర్ ను చూసిన చాలామంది ఈ సినిమా నరేష్ పవిత్ర బయోపిక్ అని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర లోకేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు సందర్భాల్లో పవిత్ర లోకేశ్ పరువు పోయే విధంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనల గురించి స్పందించడానికి గతంలో పవిత్ర లోకేశ్ అస్సలు ఇష్టపడలేదు. తాజాగా ఈ ఘటన ల గురించి స్పందించిన పవిత్ర లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

నరేష్, నేను ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కలిగి ఉన్నామని ఇష్టంతోనే కలిసి బ్రతుకుతున్నామని కూడా ఆమె అన్నారు. మేము వీధిలో పడాలని ఎప్పుడూ కూడా అనుకోలేదని పవిత్ర లోకేశ్ చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది మాత్రం నా వ్యక్తిత్వాన్ని కించపరిచే లా వ్యవహరించారని కూడా ఆమె తెలిపారు. ఈ తరహా పరిస్థితులు ఎదురైతే ఎంత హుందాగా వ్యవహరిస్తాం అనేది కూడా ముఖ్యమని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేశారటా.

నాకు అలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయని ఒకటి ఆత్మహత్య చేసుకోవడం లేదా రెండోది ఎవరికీ కనబడకుండా ఇంట్లో కూర్చోవడమని కూడా ఆమె అన్నారు. ఆ పరిస్థితులు ఎదురైన సమయంలో నరేష్ నాకు అండగా నిలిచారాని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: