కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సైతం ప్రజలకు ఎన్నో రకాల స్కీములను, పథకాలను సైతం అమలు చేస్తూ కొన్ని స్కీమ్స్ ద్వారా దీర్ఘకాలికంగానే ఉచితంగా బెనిఫిట్ ను సైతం అందిస్తూ ఉన్నది.. అయితే కేవలం ఒక్క స్కీమ్ ద్వారానే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా రూ .14 లక్షల రూపాయలను సైతం ఆర్థిక సహాయంగా పొందవచ్చు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాలలో చదువుకునే వారికి ఈ సహాయం అందుతుందట. వీటి గురించి పూర్తి సమాచారం ఎప్పుడూ చూద్దాం.


సెంట్రల్ గవర్నమెంట్ సామాజిక న్యాయం సాధికారిక విభాగం నుంచి ఈ విషయాన్ని ప్రకటించింది.విదేశాలలో MS, పీహెచ్డీ కోర్సులు వంటివి చదవడానికి మక్కువ చూపిస్తున్నటువంటి విద్యార్థులకు సైతం ఈ స్కీమ్ కు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది..https://www.nosmsje.gov.in/nosmje/ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. అయితే ఈ స్కీమ్ కు సైతం ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. అందుకు తగ్గట్టుగా అర్హత పొంది ఉండాలి దీనివల్ల  ఏకంగా 15400 డాలర్లను కూడా అందిస్తుంది..  మొత్తం మీద మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా 14 లక్షల రూపాయలను సైతం పొందవచ్చు..


ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్లను కూడా అందించడమే కాకుండా యాక్సిడెంటల్ జర్నీ, అలవెన్స్ తో పాటు, ట్యూషన్ ఫీజు వీసా ఫీజులను, ఎయిర్ ప్యాసేజ్ వంటి ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుందట. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు దరఖాస్తు చేసుకొని అవకాశం ఉంటుందని వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం అమ్ములు చేస్తున్నటువంటి ఈ స్కాలర్షిప్ వల్ల చాలా మంది పరోక్షంగా ప్రత్యక్షంగా  బెనిఫిట్ సైతం పొందుతున్నారు. అయితే ఈ కాలర్ షిప్ అప్లై చేసుకోవడానికి కేవలం కొంత సమయం మాత్రం ఉండడంతో ఆసక్తి కలిగిన అర్హత కలిగిన వారు ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: