రీసెంట్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న కె.విశ్వనాధ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం శ్రీనివాస్ కలిసిన సంగతి తెలిసిందే. పవన్ వినమ్రతతో విశ్వనాధ్ గారి కాళ్లకు మొక్కి మరి తన కృతజ్ఞతలను తెలియచేశాడు. ఆ డిస్కషన్ లో విశ్వనాధ్ గారితో పవన్ త్రివిక్రం చర్చలు జరిపారట.


విశ్వనాధ్ గారు తీసిన సినిమాలు ఎంతో స్పూర్తినిచ్చాయని తన దర్శకత్వంలో ఆయన నటించే అవకాశం రాలేదని. అలా ఓ దర్శకుడిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అది తన అదృష్టమని అన్నారు త్రివిక్రం. ఇక ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ మీడియా వర్క్స్ పతాకంలో త్రివిక్రం పవన్ కలిసి విశ్వనాధ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట.  


కళలను కాపాడే సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన విశ్వనాధ్ మెగా ఫోన్ పట్టుకుని చాలా కాలం అయ్యింది. గొప్ప దర్శకులుగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఎనౌన్స్ మెంట్ రాగానే విశ్వనాధ్ కు దర్శకత్వం అవకాశం ఇస్తున్నారు పవన్, త్రివిక్రం. కచ్చితంగా వారి నిర్మాణలో విశ్వనాధ్ గారు సినిమా తీసే అవకాశాలు ఉన్నాయట.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 2019 డైరెక్ట్ గా ఈసారి ఎలక్షన్స్ లో దిగుతున్న పవన్ ఈ గ్యాప్ లోనే కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: