అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే..కానీ ఈ చిత్రంపై సరైన క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేక పోతున్నారు. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న విషయంపై ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అయితే ‘సవ్యసాచి’ కన్నా లేటుగా షూటింగ్ మొదలు పెట్టి దర్శకుడు మారుతి ‘శైలజా రెడ్డి అల్లుడు’చక చకా పూర్తి చేశాడు. ఇక ఆ చిత్ర రిలీజ్ డేట్ను నిర్మాణ సంస్థ కన్ఫమ్ చేసింది. ఆగస్టు 31న ఈ చిత్రం రిలీజవుతుందని ఇంతకుముందే వార్తలొచ్చాయి.
అప్పటికే ‘సవ్యసాచి’ మొదలు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ముందే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి ఆగస్టు ద్వితీయార్ధంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేసింది. ఆ సినిమా ఈ నెలలోనే వచ్చేట్లయితే ‘శైలజా రెడ్డి అల్లుడు’ను వెనక్కి జరపాలన్నట్లుగా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కానీ అనున్న ప్రకారం ‘సవ్యసాచి’ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యే పరిస్థితి లేనట్లు కనిపిస్తుంది.
దాంతో ఇప్పుడు మొదట రిలీజ్ అయ్యేది ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఖరారైంది. అనుకున్నట్లే ఆగస్టు 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆడియో కూడా లాంచ్ చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించింది. అను ఇమ్మాన్యుయెల్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.