ఈరోజు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు. భారతదేశ ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ను అతడి చిన్నతనంలో నెహ్రుగా వేషధారణ చేసి బన్నీ అప్పట్లో తన సరదాలు తీర్చుకునేవాడు.

ఇప్పుడు ఇదే బాలల దినోత్సవం రోజున బన్నీ వ్యూహాత్మకంగా మహేష్ కు చెక్ పెడుతూ మరో అడుగు ముందుకు వేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని మొదటి పాట లిరికల్ వీడియో రేపు విడుదల కాబోతోంది. అయితే ఆ పాట విడుదల కాకుండానే తన ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన మూడవ పాటను ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారు. 

‘డాడీ’ అంటూ తండ్రి ప్రేమ గురించి ఈ పాట ఉండబోతోంది. వాస్తవానికి ఈ పాటను ఈనెల 21న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే అనుకోకుండా చిల్డ్రన్స్ డే కలిసి రావడంతో ఈ పాటను ఈరోజు విడుదల చేస్తున్నారు.  సంగీత దర్శకుడు తమన్ ఈ పాటకు కూడ చాల అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘సామజవరగమన’ ‘రాములో రాముల’ పాటలు రెండు విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకోవడమే కాకుండా ఛానల్స్ లో అదేవిధంగా ఎఫ్ ఎమ్ రేడియోలలో సెల్ ఫోన్స్ కు సంబంధించి రింగ్ టోన్స్ గా హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఈ పాటల రైట్స్ ను కొనుక్కున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థకు కోట్లల్లో లాభాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఒక టాప్ హీరో సినిమా పాటలు ఈ రేంజ్ లో పాపులర్ అయిన పరిస్థుతులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదల కాబోతున్న ‘డాడీ’ పాట కూడ అందరికీ నచ్చి ఒక మ్యానియాను క్రియేట్ చేయగలిగితే ‘అల వైకుంఠపురములో’ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి అన్నది ఊహలకు అందని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: