మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ కు కాసులు కురిపిస్తున్న ‘జబర్దస్త్’ కార్యక్రమానికి నాగబాబు రోజా ల కాంబినేషన్ అత్యంత కీలకం. ఆ మధ్య జరిగిన ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఎన్నికలలో పోటీ చేసిన పరిస్థితులలో వారి స్థానంలో వేరువేరు సెలెబ్రెటీలను జడ్జీలుగా తీసుకు వచ్చినా వారెవరు రాణించ లేకపోయారు.

ఇలాంటి పరిస్థితులలో నాగబాబు టీమ్ పై అలిగాడు అంటూ గాసిప్పులు గుప్పు మంటున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ‘జబర్దస్త్’ స్కిట్స్ ను ప్రజెంట్ చేసే టీమ్స్ లో కీలకంగా ఉండే చమ్మక్ చంద్ర టీమ్ కు జీ టివి త్వరలో ప్రారంభిస్తున్న ఒక కామెడీ షోకు స్కిట్ కు రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కామెడీ షోను ఇప్పటికే ‘జబర్దస్త్’ షో నుండి బయటకు వెళ్ళిపోయిన ‘జబర్దస్త్’ క్రియేటివ్ టీమ్ నితిన్ డిజైన్ చేస్తున్న నేపధ్యంలో జబర్దస్త్ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన వారందర్నీ ఈ కొత్త కార్యక్రమంలోకి లాగేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన మల్లెమాల సంస్థ ప్రస్తుతం ‘జబర్దస్త్’ కార్యక్రమంలో పనిచేస్తున్న వారందరి దగ్గర నుంచి ఎగ్రిమెంట్ లు అడిగినట్లు టాక్. 

ఇలా ఎగ్రిమెంట్ తనను కూడ అడగడంతో నాగబాబు హర్ట్ అవ్వడమే కాకుండా తాను ఈ కార్యక్రమానికి ఇకరాను అని చెప్పినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన మల్లెమాల సంస్థ నిర్వాహకులు నాగబాబు అలకను తీర్చే కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.  అంతేకాదు అవసరం అనుకుంటే నాగబాబుకు మరింత భారీ పారితోషికం ఇవ్వడానికి మల్లెమాల సంస్థ రాయబారాలు నడుపుతున్నట్లు టాక్. ఈ సంస్థ నిర్వాహకులకు చిరంజేవికి మంచి సాన్నిహిత్యం ఉన్న నేపధ్యంలో ఏదోవిధంగా ‘జబర్దస్త్’ షోలో ఏర్పడిన ఈ టీ కప్ లో తుఫాన్ ను పెద్దది అవ్వకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: