సినిమా ఇండస్ట్రీలో హిట్టు కొడితే వాళ్ల ఫేట్ మారినట్టే. హీరో అయితే తన రేంజ్ పెంచుకుంటాడు. డైరక్టర్ అయితే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. వెంటనే స్టార్ ఛాన్సులు అందుకుంటాడు. అయితే టాలీవుడ్ లో ఓ డైరక్టర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా సరే ఏ హీరో అతని వంక చూడటం లేదట. ఇంతకీ హిట్టు కొట్టినా ఛాన్సులు లేని డైరక్టర్ ఎవరంటే ఇంకెవరు గీతా గోవిందం డైరక్టర్ పరశురాం అని అంటున్నారు.

 

అర్జున్ రెడ్డితో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు గీతా గోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చాడు పరశురాం. ఆ సినిమా తర్వాత విజయ్ స్టార్ హీరోగా మారాడు.. కాని అంత పెద్ద హిట్టు బొమ్మ చేసిన పరశురాం మాత్రం ఇంకా హీరోలను వెతికే పనిలో ఉన్నాడు. గీతా గోవిందంతో తన సత్తా చాటిన పరశురాం మహేష్ కోసం ఓ లైన్ అనుకున్నాడట.

 

అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా రిస్క్ చేయదలచుకోని మహేష్ అతన్ని సున్నితనంగా వద్దన్నాడట. ఇక మహేష్ కాదనడంతో మళ్లీ విజయ్ దేవరకొండతోనే సినిమా చేయాలని చూశాడు పరశురాం. విజయ్ కూడా సినిమా చేస్తాడ అన్నాడు కాని ప్రస్తుతం కమిటైన సినిమాలన్ని పూర్తయ్యాక కాని పరశురాం తో చేస్తా అన్నాడు. అందుకే విజయ్ మీద కూడా ఆశలు వదులుకున్నాడు పరశురాం.  

 

ఇక ప్రస్తుతం అతని చూపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద పడ్డదని తెలుస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే వెంటనే మరో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అందుకే ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట పరశురాం. ప్రభాస్ ఓకే అంటే వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. గీతా గోవిందం తర్వాత ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు ప్రభాస్ ఛాన్స్ దొరికితే మంచిదే కాని ప్రభాస్ కూడా రిస్క్ అనుకుంటే మాత్రం మళ్లీ పరశురాం డైలమాలో పడ్డట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: