పటాస్ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతూ... తన సినిమా వస్తుందంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకుల్లో  నమ్మకం కలిగించిన దర్శకుడు  అనిల్ రావిపూడి. తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేక్  చేస్తూ... హీరోల ఖాతాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను  జత చేస్తూ... అరే ఏముందిరా సినిమా అంటూ ప్రేక్షకులు అనుకునేంతలో ప్రభావితం చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే అనిల్ రావిపూడి దర్శకుడిగా మారకముందు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ కొన్ని సినిమాలకు పనిచేశాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆగడు సినిమాకి కూడా స్క్రిప్ట్ వర్క్ చేశాడు అనిల్ రావిపూడి. 

 

 

 

 తాజాగా మహేష్ బాబు ఆగడు సినిమా గురించి అనిల్ రావిపూడి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగడు సినిమాకి ఫస్టాప్ స్క్రిప్టు వర్కు పూర్తి చేసే సమయానికి... తనకు పటాస్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశం వచ్చిందని... దీంతో ఆగడు సినిమాకు సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయకుండానే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. దీంతో ఇప్పటికీ శ్రీనువైట్ల గారు ఎక్కడ కనిపించినా.. ఏంటయ్యా నాతో సెకండాఫ్ కూర్చోకుండానే వెళ్ళిపోయావ్ గా...  నీ అంతు చూస్తా అంటూ ఉంటారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. శ్రీను వైట్ల గారు అలా అన్నప్పుడల్లా... నిజంగానే తాను ఆగడు సినిమాకి సెకండాప్ స్క్రిప్ట్ సమయంలో అందుబాటులో ఉంటే... ఆగడు సినిమా హిట్ అయ్యేదేమో అని తనకు అనిపిస్తు ఉంటుందని  అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

 

 

 

 ఇదిలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా గురించి ప్రతి వారం అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను  అలరిస్తుంది  చిత్ర బృందం. అంతేకాకుండా ఈ సినిమాలో 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తూ ఓ ముఖ్య పాత్రలో నటించబోతోంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: