ఇప్పటికే ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొన్నాళ్లుగా మంచి జోష్ మీదున్నారు. వాస్తవానికి ఆయన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదలుకావలసి ఉంది, అయితే ఆ కథ యొక్క స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో దానిని ప్రక్కన పెట్టారట మహేష్. 

 

ఇక కొన్నాళ్లుగా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన తదుపరి సినిమాని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల తో చేయడానికి సిద్ధం అయ్యారని, ఇటీవల ఆ సినిమాకు సంబందించిన కథా చర్చలు పూర్తి అవడం, పరశురామ్ చెప్పిన కథ మహేష్ కు ఎంతో బాగా నచ్చడంతో వెంటనే దానిని మొదలెట్టడానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సమాచారం. అయితే ఈ సినిమాని వాస్తవానికి ఈ పాటికే మొదలెట్టవలసి ఉందని, కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన కొన్నాళ్లపాటు సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఈ సినిమా ప్రారంభం కూడా వాయిదా వేసారట. కాగా కొందరు మహేష్ సన్నిహితులు చెప్తున్న దానిని బట్టి, సూపర్ స్టార్ నటశేఖర కృష పుట్టినరోజైన మే 31న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందట. 

 

ప్రతియేడు తండ్రి పుట్టినరోజున తన సినిమాకు సంబంధించి ఏదైనా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, లేదా ప్రారంభోత్సవం వంటివి చేసే అలవాటున్న మహేష్ బాబు, ఈసారి కూడా సరిగ్గా అదే రోజున పరశురామ్ సినిమాని పూజ కార్యక్రమాలతో ఆరంబించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయిందని, ఏప్రిల్ నెలలో ఈ సినిమాకు సంభందించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుందని అంటున్నారు. మరి ఈ వార్త కనుక నిజమే అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది శుభవార్తే అని చెప్పాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: