బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత గానో  గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ఇక బాలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. అయితే కేవలం సినిమాలలోనే కాదు.. తన ఫోటో షూట్లతో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఈ అమ్మడు . మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనదైన అందం అభినయంతో ఆకట్టుకుంది హీరోయిన్. 

 


 ఇప్పటివరకు తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ హీరోయిన్ లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో... ఏకంగా  వైబ్రేటర్ వాడే సన్నివేశంలో  నటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా వైబ్రేటర్  వాడే సన్నివేశంలో  కియారా అద్వానీ నటించడం సంచలనంగా మారింది. అయితే ఈ వైబ్రేటర్ వాడే సన్నివేశం కోసం తాను ఎలా ప్రిపేర్ అయ్యాను అనే విషయాన్ని తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఆ వైబ్రేటర్ సన్నివేశాల్లో నటించే ముందురోజు రాత్రి ఎంతో నెర్వస్  అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు . ఇక ఆ తర్వాత మహిళలు వైబ్రేటర్ ఎలా వాడుతారు అనేది  ఒకసారి గూగుల్ లో చెక్ చేసి తెలుసుకున్నాను అంటూ వెల్లడించారు... అగ్లీ  ట్రూత్ లాంటి కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను కూడా చూశాను అంటూ చెప్పుకొచ్చింది.. 

 

 కాగా లవ్  స్టోరీస్  వెబ్  సిరీస్  నెట్ఫ్లిక్  లో విడుదలై ఎంత సంచలనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్గా మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఈ షోలో కియారా అద్వానీ మేఘ  అనే గృహిణి  పాత్రలో నటిస్తోంది. తన భర్తతో శృంగారంలో సాటిస్ఫాక్షన్ లేకపోయినా మేఘా... భావ ప్రాప్తి కోసం ఇలా వైబ్రేటర్ వాడుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో కియారా  అద్వానీ  భర్త పాత్రలో విక్కీ కౌశల్ కనిపించారు. ఇక ఎప్పుడు అందం అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్  ఒక్కసారిగా ఇలా వైబ్రేటర్ సన్నివేశాల్లో నటించడం అప్పట్లో  సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: